హైదరాబాద్: పంజాగుట్టలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట ట్రాఫిక్ ఏరియాలో ఓ వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అడ్డువచ్చిన వారిని ఢీకొంటూ వెళ్లిపోయాడు. స్థానికులు అతడి కారును వెంబడించి అడ్డుకున్నారు. కారుని ఆపి అతడిని కారు నుంచి బయటకు లాగి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.