హైదరాబాద్ : జంట నగరాల్లో ఉన్న నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంబర్పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కుత్బుల్లాపూర్ నియోజక వర్గం శంభీపూర్ లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కుత్బుల్లాపూర్ లోని సత్ జ్ఞాన్ స్కూల్లో ఎమ్మెల్యే వివేకానందా, ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని కార్మిక శాఖ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ ఓటును వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ నాట్కో స్కూల్ లో బీఆర్ఎస్అభ్యర్థి మాగంటి గోపినాథ్ ఓటువేశారు. యాఖత్ పురా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సామ సుందర్ రెడ్డి దంపతులు ఓటును వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్ డివిజన్లో పోలింగ్ బూత్ లో ఓటింగ్ సరళిని డిప్యూటీ స్పీకర్, బీ ఆర్ ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పరిశీలించారు.
కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్ఖానాలోని గార్డియన్ స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 95లో ఓటు వేశారు.