Thursday, May 2, 2024

ఓటింగ్‌ సరళిని పర్యవేక్షించిన మంత్రి కేటీఆర్‌

spot_img

సిరిసిల్లా:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

సిరిసిల్లా నియోజకవర్గంలో పోలింగ్‌ సరళిని బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షించారు. నగరంలోని పలు పోలింగ్‌ బూత్‌ ల వద్దకు వెళ్లి అక్కడున్న అధికారులను ఓటింగ్‌ తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఓటేసేందుకు వచ్చిన ఓటర్లతో కూడా ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

Latest News

More Articles