ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ఇవాళ (బుధవారం) గ్రేటర్ హైదరాబాద్ అంతటా ధర్నాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ ఉదయం నుంచే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఈ ధర్నాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అమీర్పేటలోని మైత్రివనం దగ్గర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో సనత్ నగర్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన MLA లు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, KP వివేకానంద్తో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
ఇది కూడా చదవండి: రేవంత్ నుంచి మహేందర్ రెడ్డి వరకు అందరూ సన్నాసులే