తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కారు దూసుకెళ్తోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సొంతూరు బొప్పాపూర్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. 5వ రౌండ్లో బీఆర్ఎస్ 6,037 ఓట్ల లీడింగ్లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మొత్తం 22,787 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి 1,268 ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 2,276 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.