ప్లాట్ అమ్మకంలో మోసం చేసిన దంపతులను నగర సీసీఎస్ పోలీసులు నిన్న(శనివారం) అరెస్ట్ చేశారు. రైల్వేలో పనిచేస్తున్న ఇద్దరు హైదర్నగర్లో ప్లాట్ కొనుగోలు చేశారు. ఇందుకోసం యజమానులైన టీఎస్ఎస్ వరప్రసాద్, స్వాతి దంపతులకు మధ్యవర్తి నాగేశ్వరరావు ద్వారా రూ.19.50 లక్షలు చెల్లించారు. అంతకుముందే అది మరొకరికి అమ్మినట్లు ఆ ఉద్యోగులు గ్రహించారు. బాధితుల ఫిర్యాదుతో గత అగస్టులో నగర సీసీఎస్ కేసు నమోదు కాగా తాజాగా దంపతులతో పాటు మధ్యవర్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ నియోజకవర్గంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్