బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గుండాల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారం అండ చూసుకొని గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై దాడులు పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. తాజాగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పూసల యోగేంద్ర చారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి యత్నించారు. కారులో వెళ్తున్న యుగేంద్రాచారిని జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంబడించారు. తప్పించుకున్న యోగేంద్రాచారి తప్పించుకోవడంతో ఆయన కారును ధ్వంసం చేశారు.
Read Also: రాచకొండ పరిధిలో రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత
కాగా, యుగేంద్రాచారి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సాయి చరణ్ మధ్య ఎన్నికల సమయంలో గొడవలు జరిగాయి. ఇరువురు సోషల్ మీడియాలో ఎవరి పార్టీల గురించి వారు ప్రచారం చేసుకుంటూ విమర్శలకు దిగడం గొడవకు దారితీసింది. అది మనసులో పెట్టుకొని సాయి చరణ్ తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి తనపై దాడికి ప్రయత్నించారని ఉపేంద్ర చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.