హైదరాబాద్లోని ఓ కరాచీ బేకరీలో భారీ ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్లోని గగన్ పహడ్ కరాచీ బేకరీ కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో బేకరీలో ఉన్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని బేకరీ యాజమాన్యం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: సోషల్ మీడియా వార్.. బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ నాయకుల దాడి