Friday, May 3, 2024

111 జీవోకు తూట్లు పొడిచిందే కాంగ్రెస్ పార్టీ..!

spot_img

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి 111 జీవోను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మీడియా సమావేశంలో గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 111 జీవో మీద రాజకీయంగా రాద్ధాంతం చేసి బిఅరెస్ పార్టీని, కేసిఆర్ పేరును ఆప్రతిష్ట పాలు చేయ్యాలనే ఉద్దేశ్యంతో చేస్తున్న కుట్రను తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరనే విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి.

111 జీవోకు తూట్లు పొడిచిన ప్రభుత్వం, తూట్లు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది చరిత్ర. రాజశేఖర్ రెడ్డి నుండి కిరణ్ కుమార్ రెడ్డి వరకు, 111 జీవో పరిధిలో భారీగా అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు, కాంగ్రెస్ కనుసైగల్లోనే వెలసింది వాస్తవం కాదా?? జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ కు ఎలాంటి ఆదాయం రాకుండా, అధికారుల్ని మ్యానేజ్ చేసి, బడా బడా వ్యాపారవేత్తలకు 111 జీవో భూములు కట్టబెట్టి, వాటిలో అక్రమంగా కట్టడాలు కట్టేలా పర్మిషన్ ఇచ్చిందే మీ పార్టీ. దళారులకు, బడా వ్యాపారస్తులకు అక్రమంగా 111 జీవో భూముల్ని దోచి పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా’ అని ప్రశ్నించారు గెల్లు.

Latest News

More Articles