Friday, May 17, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో కోటి రూపాయల బంగారం స్వాధీనం

spot_img

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో భారీగా అక్రమ బంగారం దొరికింది. రియాద్ నుండి హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద భారీగా అక్రమ బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రయాణికులు అక్రమ బంగారాన్ని పొడిగా తయారుచేసి దానిని షూసులో దాచుకొని తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. నిందితుల వద్ద నుండి బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు కోటి 13 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.

Latest News

More Articles