Monday, May 20, 2024

సీతక్క సీన్ రివర్స్.. ములుగులో బడే నాగజ్యోతి

spot_img

ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు చెక్ పెట్టే పని సాఫీగా సాగిపోతుంది. ఈ సారి అక్కడ గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అంటూ రిపోర్ట్స్ వస్తుండటంతో క్యాడర్ మరింత జోరు పెంచింది. తెలంగాణ ప్రభుత్వం ఏటూరునాగారం డివిజన్ గా ప్రకటించడంతో మండలంలో పలు గ్రామాల మీదుగా పార్టీ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏటూరు నాగారం బస్టాండు ఆవరణంలో బాణా సంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు.

ఇక ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మినర్సింహారావు చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. రెవెన్యూ డివిజన్ కు సహకరించిన మంత్రులకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీతక్కని ఓడించి ఎమ్మెల్యే అభ్యర్ధి బడే నాగజ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కి బహుమతిగా ఇస్తామని జిల్లా అధ్యక్షుడు లక్ష్మినర్సింహారావు అన్నారు.

Latest News

More Articles