Saturday, May 18, 2024

మార్చి మొదటివారంలో మేడిగడ్డ, కాళేశ్వరం అసలు రూపం చూపిస్తాం-కేటీఆర్

spot_img

మార్చి 1వ తారీఖు నుంచి చలో మేడిగడ్డ కారక్రమానికి పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. 150 -200మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. నేడు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ భవన్ నుంచే మేడగడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో తొలిరోజు కాళేశ్వరం వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర రూపాన్ని తెలంగాణ ప్రజలతోపాటు ఆరోపణలు చేస్తున్నవారికి చూపిస్తామని కేటీఆర్ చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఈ మేడిగడ్డకు వెళ్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం అంటే ఏంటో సజీవింగా చూపిస్తామని కేటీఆర్ అన్నారు. విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామని తెలిపారు.

Latest News

More Articles