Friday, May 17, 2024

నీ గురువులే కేసీఆర్ ని ఏం పీకలేకపోయారు.. నీతో ఏమవుతుంది ?

spot_img

సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు కేటీఆర్. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఇక చూస్తారు. రేవంత్ రెడ్డి… కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు. మీ గురువులతోనే కాలేదు, మీ వల్లే ఏం అవుతుంది?” అంటూ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీ మేనేజ్ మెంట్ కోటాలో సీఎం పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలేనని ఎద్దేవా చేశారు.

ఇచ్చిన హామీల అమలును తప్పించుకునేందుకు నిత్యం ఏదో ఒక అవినీతి కథ అల్లుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆరు డిక్లరేషన్లు అంటూ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని, నాడు కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమవుతోందని అన్నారు. ఉచిత బస్సు పథకంతో బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకుంటున్నారని, ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోతోందని కేటీఆర్ వెల్లడించారు. ఏదైనా పథకం ప్రకటించేటప్పుడు సాధ్యాసాధ్యాలు ఆలోచించి తీసుకురావాలని హితవు పలికారు.

Latest News

More Articles