Friday, May 17, 2024

సూర్యాపేటలో కాంగ్రెస్ నేతల దౌర్జన్యం

spot_img

సూర్యాపేటలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిందన్న కక్షతో కాంగ్రెస్ నేతలు అరాచకానికి పాల్పడుతున్నారు. కౌన్సిలర్ పావని కృపాకర్ ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. రెండు గంటలుగా దౌర్జన్యం చేస్తున్నప్పటికీ.. పోలీసులు చోద్యం చూస్తున్నారు.

అటు బీఆర్ఎస్ నేత వై. వెంకటేశ్వర్లుపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. అయినా పోలీసులు పట్టించుకోవడంలేదు. దీంతో తమకు రక్షణ అందజేయాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

More Articles