Thursday, May 2, 2024

కళ్లల్లో కారం చల్లిన వదిన.. గొడ్డలితో నరికిన అన్న

spot_img

ఆస్తి కోసం బంధుత్వాలను సైతం పణంగా పెడుతున్నారు. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అనే వరుసలేవి చూడకుండా.. ఆస్తే ప్రాణంగా భావిస్తున్నారు. చివరికి ఆస్తి కోసం సొంతవారిని కూడా కడతేర్చుతున్నారు. తాజాగా అలాంటి విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో కుమ్మరి చంద్రయ్య(65) అనే వ్యక్తికి కుమ్మరి అంజనేయులు(43), కుమ్మరి ప్రభు(46) అనే ఇద్దరు కుమారులున్నారు. చంద్రయ్య తనకున్న వ్యవసాయ భూమిని కొడుకులకు సమానంగా పంచాడు. మరో 14 గుంటల భూమిని తన వద్దే ఉంచుకున్నాడు. అయితే ఆ భూమిని ఎవరు సాగు చేయాలనే విషయమై ఇద్దరు అన్నదమ్ములు తరచూ గొడవ పడేవారు. తల్లితండ్రులిద్దరూ… చిన్న కొడుకు కూడా అంజనేయులు వైపే ఉండడంతో ప్రభు.. తల్లిదండ్రులు, తమ్ముడిపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. యాసంగి పంటను విత్తేందుకు శనివారం మధ్యాహ్నం తన తండ్రి భూమిలో దున్నుతున్న ఆంజనేయులిని అన్న ప్రభు అడ్డుకున్నాడు.

Read Also: రాజకీయాలకు వీడ్కోలు పలికిన ఎంపీ గల్లా జయదేవ్

ఈ విషయమై భార్య, తండ్రితో మాట్లాడుతూ ఆంజనేయులు రాత్రి అన్నం తింటున్నాడు. ఈలోగా ప్రభు తన భార్య, కొడుకుతో కలిసి అంజనేయులి ఇంటిపై దాడిచేశాడు. ప్రభు భార్య అంజనేయులు కండ్లలో కారం చల్లగా.. అజనేయులుపై ప్రభు గొడ్డలితో విచక్షణరహితంగా దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రిని కూడా గొడ్డలితో నరికాడు. ఈ దాడిలో అంజనేయులు రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోగా, తీవ్రంగా గాయపడిన చంద్రయ్యను స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సదాశివపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభు, అతని భార్య, కొడుకును అదుపులోకి తీసుకున్నారు.

Latest News

More Articles