Sunday, May 19, 2024

ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ నేతలకు కేసీఆర్ ఆదేశాలు

spot_img

త్వరలో ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేయవద్దని నేతలకు ఆయన ఆదేశించారు. దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్‎కు గురయ్యారు. యూనియన్‎కు చెందిన ముగ్గురు ముఖ్య నేతలు తమ పదవులకు రాజీనామా చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తమ రాజీనామాలు అధినేతకు పంపించారు. ఈ క్రమంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

Latest News

More Articles