నార్సింగిలో గంజాయి చాక్లెట్ల కలకలంరేగింది. కోకాపేట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని ఒరిస్సాకు చెందిన సౌమ్య రాజన్గా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో పట్టుకొని నిందితుని నుంచి 40 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్ట్మెంట్లో కార్మికులకు అమ్ముతుండగా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఒడిస్సా నుంచి హైదరాబాద్కు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఆమోదానికి 19 బిల్లులు