Saturday, May 18, 2024

పెళ్లికెళ్లి వస్తూ బోల్తా పడిన కారు.. ముగ్గురు మృతి

spot_img

నల్లగొండ జిల్లా కట్టంగూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని యరసానిగూడెం వద్ద వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని దవాఖానకు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కట్టంగూరు హాస్పిటల్‌కు తరలించారు.

మృతులను ఖమ్మం జిల్లా ఖిల్లా బజార్‌ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్‌లో వివాహా కార్యక్రమానికి హాజరై ఖమ్మం తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నది. కారు డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles