రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పైనా ఓ కారు పల్టీ కొట్టింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ పిల్లర్ నెంబర్ 215 వద్ద జరిగింది. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పిడింది.
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం కారణంగానే కారు డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరు పీల్చుకున్నారు.