న్యూఢిల్లీ: యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. రైతుబంధు పంపిణీకి (నవంబర్ 24న ఈసీ అనుమతించింది. ఈ నెల 28వ తేదీలోపు పంట సాయాన్ని అందించాలని తన ఉత్తర్వుల్లో ఈసీ పేర్కొంది. రైతులంతా పెట్టుబడి సాయానికి ఎదురుస్తున్న వేళ.. అనుమతులను ఉపసంహరించుకుంటూ సోమవారం ఉదయం ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.