ఈ ఏడాదిలోనూ కొలువుల కోత కొనసాగుతోందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బాంబు పేల్చారు. ఏఐ సాఫ్ట్వేర్, ఆటోమేషన్ వైపు మళ్లుతున్న క్రమంలో కొలువుల కోతపై ఉద్యోగులు ఆందోళన నెలకొన్న నేపథ్యంలో సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read.. కాంగ్రెస్ నేత వేధింపులు.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
అయితే, గత ఏడాది వలే తొలగింపులు ఉండవని, ప్రతి టీమ్లోనూ లేఆఫ్స్ ప్రభావం ఉండదని ఉద్యోగులకు పంపిన మెమోలో పిచాయ్ ఇంతకుముందు స్పష్టం చేశారు. ఈ ఏడాది అనుగుణంగా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు. వాయిస్ అసిస్టెంట్ యూనిట్స్, పిక్సెల్, నెస్ట్, ఫిట్బిట్, యాడ్ సేల్స్, అగ్మెంటెడ్ రియాలిటీ టీంలకు సంబంధించిన హార్డ్వేర్ టీంకు చెందిన పలువురు ఉద్యోగుల తొలగింపు ఉంటుందని గతవారం గూగుల్ ప్రకటించింది.