Thursday, May 2, 2024

కాంగ్రెస్ నేత వేధింపులు.. కుటుంబం ఆత్మహత్యాయత్నం

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయి. సామాన్య కార్యకర్తల నుంచి లీడర్ల వరకు దాడులకు బాధితులవుతున్నారు. ఇలాంటి వేధింపులు భరించలేక తాజాగా కరీంనగర్‎లో ఓ బీఆర్ఎస్ నేత కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గన్నేరువరం మండలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సంపత్ చురుకుగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటాడు. దాంతో ఆయనను ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని గన్నేరువరం కాంగ్రెస్ ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించాడు. సంపత్ ఎంతకూ వినకపోవడంతో పార్టీలో చేరకుంటే చంపేస్తానని వేధింపులకు గురిచేశాడు. దాంతో వేధింపులు భరించలేక సంపత్ రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఆయన భార్యాపిల్లలు కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. తమ కుటుంబానికి రక్షణ కలిపించాలని సంపత్ భార్య గీత.. కరీంనగర్ కలెక్టరేట్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న పోలీసులు.. వెంటనే స్పందించి ఆమె చేతిలోని పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు.

Read Also: ఆ రోజు అయోధ్యలో భోజన ఖర్చంతా నాదే!

Latest News

More Articles