Sunday, May 19, 2024

ఫిబ్ర‌వ‌రి 8న ఫైన‌ల్ ఓటర్ల జాబితా విడుద‌ల చేస్తాం

spot_img

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు సీఈఓ వికాస్‌రాజ్‌. ఫిబ్రవరి 8వ తేదీన ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని చెప్పారు.

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో నేషనల్‌ ఓటర్స్‌ డే సందర్భంగా సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ జనరల్‌ ఎలక్షన్స్‌ ప్రశాంతంగా జరిపాం. మొదటిసారి హోం ఓటింగ్‌ విజయవంతంగా నిర్వహించాం. ఇప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుత‌న్నాం.ఇందులో కూడా విజ‌యం సాధిస్తాం. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత. రాష్ట్రంలో తొమ్మిది లక్షల ఓటర్స్ ను కొత్తగా నమోదు చేసినట్టు తెలిపారు వికాస్‌రాజ్‌.

ఇది కూడా చదవండి: జీవన్ రెడ్డి.. కక్ష సాధింపు వద్దు, ప్రజల కోసం పనిచేయండి

Latest News

More Articles