Sunday, May 5, 2024

ఎట్టకేలకు అక్కినేని అభిమానులకి మంచిరోజులు..!

spot_img

చాలా కాలం తర్వాత అక్కినేని నాగార్జున తన కొత్త సినిమా నా సామి రంగతో హిట్ కొట్టాడు. సినిమా అన్ని ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ దాటి బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అయింది.దీంతో తన తదుపరి ప్రాజెక్ట్‌లను కూడా వరుసలో ఉంచుకుని నాగార్జున ముందుకెళ్తునన్నారు.దీనికి సంబంధించి ఒక తాజా అప్డేట్ అక్కినేని ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని ఇస్తుంది.

నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మల్టీ స్టారర్ చేస్తున్నాడు. ఇందులో ధనుష్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక నాగార్జున OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కోసం మరో స్పై థ్రిల్లర్‌పై కూడా సంతకం చేశాడు. ఆ తరువాత నాగార్జున తన పాపులర్ “బంగార్రాజు” ఫ్రాంచైజీ మూడవ భాగం కూడా తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది.

మరోవైపు, అతని కుమారుడు నాగ చైతన్య పాన్-ఇండియా చిత్రం ‘తండేల్’ లో నటిస్తున్నాడు. అతని కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఇదిలా ఉంటే, నాగ్ చిన్న కొడుకు అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఒక డెబ్యూ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నాడు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లన్నీ ఇప్పుడు అక్కినేని అభిమానులను ఉత్తేజపరుస్తున్నాయి. ఈ 2024 అక్కినేని హీరోలకు బాగానే కలిసొచ్చేలా కనిపిస్తుంది.

Latest News

More Articles