హైదరాబాద్ : భక్తుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో రేవంత్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 2 నుంచి 29 దాకా ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ ఫీజు వసూలు నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది.
Also Read.. ఎగ్జామ్ రాసి వస్తుండగా ప్రమాదం.. లారీ కింద పడిన బీటెక్ యువతి