Friday, May 3, 2024

జర్నలిస్ట్ వెంకటేశ్‌పై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అనుచరుల దాడి

spot_img

తమకు అనుకూలంగా వార్తలు రాయని జర్నలిస్తులపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. ఓ పత్రిక జర్నలిస్ట్ వెంకటేష్‌పై  చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అనుచరులు హత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు చేస్తున్న ఇసుక మాఫియా, రేషన్ బియ్యం అక్రమ దందాలపై వాస్తవాలు రాసినందుకు తనపై కాంగ్రెస్ గుండాల హత్యాయత్నం చేశారని వెంకటేశ్‌ చెప్పారు. దీనికి సంబంధించి సోషల్‌ మీడియా ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గతంలో జర్నలిస్ట్‌ శంకర్‌పై కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దాడిచేశారు.

జర్నలిస్టులపై దాడి చేయడాన్ని పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest News

More Articles