Saturday, May 18, 2024

30%పిఆర్సీ పెంపు.. సీఎంకి తెలంగాణ సంస్కృతిక సారధి ఉద్యోగుల ధన్యవాదాలు

spot_img

తెలంగాణ సాంస్కృతిక సారదిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 30%పిఆర్సీ పెంచినందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబినేయ శ్రీనివాస్ ఉద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కవులు, కళాకారుల కృషి ఏంతో ఉన్నదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు తెలంగాణ సాంస్కృతిక సారదిలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. డిపిఆర్ఓకి అనుబంధం చేసి 583మందికి ఉద్యోగాలు కల్పించి మమ్మల్ని సీఎం ఆదుకున్నారు.

ఇక ప్రభుత్వం 24వేల నెల జీతాలు కల్పించి,ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30%పిఆర్సీ పెంచి 31వేలకు పైగా వేతనం పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాపై పెట్టుకున్న నమ్మకాల్ని వమ్ము చేయకుండా ప్రభుత్వ పథకాలను ప్రతి పల్లెకు మా ఆట పాటలతో చెరవేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కు హామీ ఇస్తున్నాము. మా కుటుంబాలలో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, మామిడి హరికృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అబినేయ శ్రీనివాస్.

Latest News

More Articles