చిత్తూరు జిల్లాలో విషాదం జరిగింది. అడవిలో నుంచి వచ్చిన ఓ ఏనుగు దంపతులపై దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన గుడిపాల మండలం రామాపురంలో జరిగింది. ఇవాళ(బుధవారం) గ్రామానికి చెందిన వెంకటేశ్, సెల్వి దంపతులు పొలంలో పనిచేసుకుంటుండగా ఒక్కసారి వారిపై ఏనుగు దాడి చేసి బీభత్సం సృష్టించింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
కొన్ని రోజులుగా ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.