Sunday, April 28, 2024

కార్లను అద్దెకు తీసుకొని తాకట్టు పెడుతున్న వ్యక్తులు అరెస్ట్

spot_img

హైదరాబాద్: IPL బెట్టింగ్ లు పెట్టి  నష్టపోవడంతో.. తక్కువ టైమ్ లో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశ్యంతో  కొందరు వ్యక్తులు కారులను అద్దెకు తీసుకొని తాకట్టు పెడుతున్నారు.

కారు ఓనర్ల నుంచి ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిని నాగరాజు, వెంకటేష్ లుగా గుర్తించారు.

నిందితుల వద్ద నుండి రూ.కోటి 20 లక్షల విలువ గల 10 కారులను  స్వాధీనం చేసుకొని నిందితులను  రిమాండ్కు తరలించినట్లు వనస్థలిపురం పోలీసులు పేర్కొన్నారు. పరారీలో మరో ఇద్దరు రామారావు, శివ ల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

Latest News

More Articles