Sunday, May 12, 2024

ప్రభుత్వ పథకాలు.. ప్రతిపక్లలకు చెంపదెబ్బల్లాంటివి

spot_img

రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణి చేపట్టామని, ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన ప్రభుత్వ పథకాలు ప్రతిపక్ష పార్టీలకు చెంపదెబ్బ లాంటిదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు కేటాయిస్తున్నట్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారుగా 4 వేల మంది అర్హులకు ఇల్లు మంజూరైనా మొదటి విడత అర్హులైన 500 మందికి ఈ నెల రెండో తారీఖున డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తున్నట్లు మాగంటి గోపీనాథ్ తెలిపారు.

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్యాలయంలో లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.మొదటి విడతలో 500 మందికి ఇల్లు మంజూరు అయినాయని మిగతా వారికి దశలవారీగా ఇల్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇల్లు కేటాయింపులు లబ్ధిదారులు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని ప్రభుత్వం ఉచితంగా ఇల్లులేని నిరుపేదలకు ఇల్లు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయకేతనం ఎగరవేయడం తద్దేమన్నారు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ళ లబ్ధిదారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest News

More Articles