సోషల్ మీడియా సవాళ్లు ప్రాణాలు తీసే స్థాయికి చేరుకున్నాయి. తాజాగా చైనాలో ఓ యువకుడు లైవ్ లో సవాల్ కు దిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఝాంగ్సూ ప్రావిన్సులో వాంగ్ ఓ యువకుడు మే 16న చైనా టిక్టాక్ వెర్షన్ డుయిన్లో ఇన్ఫ్లుయెన్సర్తో ‘పీకే’లో పోటీపడ్డాడు.
ఇందులో విజేతలకు బహుమతులు, ప్రోత్సాహకాలు ఉంటాయి. అలాగే ఓడిన వారికి శిక్షలు కూడా వేస్తుంటారు. ఇక పోటీలో ఓడినందుకు వాంగ్ 4 బాటిళ్ల చైనీస్ వోడ్కా(బైజ్యూ అనే దేశీయ మద్యం)న్ని విరామం లేకుండా తాగాల్సి వచ్చింది. మర్నాడు మధ్యాహ్నానికి అతడి ఆరోగ్యం విషమించి మరణించాడు.