కర్నూలు,ఏపీ: క్షణికావేశంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవనకొండ మండలం గుడమిరాలకు చెందిన అడ్డాకుల రంగనాయకులు(28) ఆర్ఎంపీ డాక్టర్. పత్తికొండ మండలం చిన్నహుల్తికి చెందిన లత(25)తో 2 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు(7 నెలలు) ఉన్నాడు.
కాగా,శనివారం పొలానికి వెళ్లే విషయంలో భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆవేశంలో లత పురుగుల మందు తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటాక మృతి చెందింది. భార్య మృతితో రంగనాయకులు మనస్తాపం చెంది.. కోట్ల రైల్వేస్టేషన్ పరిధిలో పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయం.. రెండు కుటుంబాల్లో విషాదం నింపడంతోపాటు 7 నెలల చిన్నారిని అనాథను చేసింది.