Wednesday, May 15, 2024

చింతపల్లి ఎస్‌ఐ సతీష్ రెడ్డి సస్పెండ్

spot_img

నల్లగొండ జిల్లా : చింతపల్లి ఎస్ఐ సతీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఐజీపీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ వివాదాలు, సివిల్ విషయాలలో జోక్యం చేసుకోవద్దని ఎవరైనా ఈలాంటి కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

Also Read.. మళ్లీ కరొనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 166 కొత్త కొవిడ్‌ కేసులు

చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం లాకప్‌డెత్‌ జరగింది. చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన సూర్యానాయక్‌(50)కు ఆయన సోదరుడికి మధ్య కొంతకాలంగా భూవివాదం ఉన్నది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఎస్‌ఐ సతీశ్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఇద్దరిని పిలిచి విచారణ జరిపారు. ఈ క్రమంలో సూర్యనాయక్‌ హైబీపీతో స్టేషన్‌లోనే కిందపడిపోయాడు. వెంటనే అతడిని బంధువులు, పోలీసులు దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

Latest News

More Articles