కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లోనే అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంత్యంత వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని కనులారా చూసేందుకు పలువురు ప్రముఖులు అయోధ్య బాట పట్టారు.
తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రాణ ప్రతిష్ట కోసం అయోధ్య చేరుకున్నారు. భార్య సురేఖ, కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్య వెళ్లారు. మరోవైపు బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ సహా, సౌత్ సూపర్ స్టార్స్ రజినీకాంత్, ధనుష్, బీటౌన్ తారలు విక్కీ కౌశల్- కత్రినా కైఫ్, రణబీర్ కపూర్- అలియా భట్, కంగనా రనౌత్, మాధురీ దీక్షిత్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తదితరులు కూడా ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట…భద్రాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు