Saturday, May 18, 2024

జూలై 31 నుంచి ఓయూ క్యాంపస్‌లో సివిల్స్‌ కోచింగ్‌

spot_img

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో 2024 సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌, మెయిన్‌ పరీక్షలకు సంబంధించి లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ ప్రారంభం కానుంది. జూలై 31 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30వ తేదీ వరకు బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు ఓయూ క్యాంపస్‌లో ఉచిత కోచింగ్‌ను ఇవ్వనున్నారు.

మొత్తం 150 మంది బ్యాచ్ ని ఎంపిక చేయనున్నారు. ఇందులో 50 మందిని మెరిట్‌ ప్రాతిపదికన, మరో 100 మందిని స్క్రీనింగ్‌ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.ఆశన్న తెలిపారు. జూలై 16న స్కీనింగ్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

పూర్తి వివరాల కోసం ఫోన్‌ నం: 040-24071178 లో సంప్రదించాలన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం www.tsbcstudycircle.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆశన్న వెల్లడించారు.

Latest News

More Articles