Saturday, May 18, 2024

మంత్రి గంగుల కమలాకర్ ని పరామర్శించిన సీఎం కేసీఆర్

spot_img

మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి ఇవాళ( బుధవారం) కరీంనగర్ లో వారి నివాసంలో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ .. మంత్రి గంగుల కు ఫోన్ చేసి పరామర్శించారు. తండ్రిని కోల్పోయిన బాధలో వున్న గంగులను సీఎం ఓదార్చి, వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు గంగుల మల్లయ్యగారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

Latest News

More Articles