Saturday, May 11, 2024

కాంగ్రెస్ అంటేనే దళారీల రాజ్యం

spot_img

వికారాబాద్ : 10 ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో ఏమి జరిగింది.. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏమీ జరిగిందో ప్రజలు ఆలోచించాలని సీఎం కేసీఆర్ కోరారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో మంచి నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. 10 ఎండల్లో మిషన్ భాగీరథ ద్వారా మారుమూల పల్లెకు కూడా త్రాగునీరు ఇస్తున్నామని తెలిపారు. రైతులు బాగుంటే దేశం బాగుంటదని, రైతు సంక్షేమనికి పెద్దపీట వేశామన్నారు. తాండూరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్  పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ నేతలు రైతు బంధు దుబారా అంటున్నారు. రైతు బంధు ఉండాలి అంటే రోహిత్ రెడ్డి తాండూరులో గెలువాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు. కాంగ్రెస్ అంటేనే దళారీల రాజ్యం. మహేందర్ రెడ్డి పెద్దమనసు చేసుకొని రోహిత్ రెడ్డి కి మద్దతు ఇచ్చిండు. బీజేపీ వాళ్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే రోహిత్ రెడ్డి వాళ్లను పట్టించి నిజాయితీగా నిలిచాడు. రోహిత్ రెడ్డి ఏది కోరిన కాదనకుండా ఇస్తున్న. రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఆయన కోరిన అన్ని పనులు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.

Latest News

More Articles