Tuesday, May 7, 2024

నూకలు తినమన్న పార్టీకి నూకలు చెల్లేలా చేయాలి

spot_img

సిద్దిపేట జిల్లా: ఓట్లు అంటే మూడొద్దుల  పండుగ కాదు.. ఐదెండ్ల భవిష్యత్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. మూడేండ్ల కింద అనేక మాయ మాటలు చెప్పిన వారు ఎం చేశారని నిలదీశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్రంల గెలుస్తుందా? కేసీఆర్ మూడో సారి గెలిచి హాట్రిక్ ముఖ్యమంత్రి కానున్నాడు.. ఇది సత్యం అని పేర్కొన్నారు. మిడిదొడ్డి, భూమ్ పల్లి అక్బర్ పేట మండల కేంద్రాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఝాట మాటల BJP ని నమ్మితే మోసపోతాం. మేం చేసిన పనులకు కొబ్బరికాయ, కత్తేర పట్టుకొని వస్తాడు. భూములు గుంజుకుంటారని తప్పుడు ప్రచారం చేస్తాడని విమర్శించారు. మోటర్లకు మీరుర్లు పెట్టానందుకే రూ.25 వేల కోట్లు ఆపినా అని నిర్మలా సీతారామాన్ స్పష్టంచేసింది. బీజేపీ కుట్రలు బయటపడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రల్లో రైతుల కరెంట్ మోటర్ల కు మీటర్లు పెట్టిండ్రని పేర్కొన్నారు.

5 గంటలకు కరెంట్ ఇస్తామని కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ చెప్పిండు. మూడుగంటలే ఇస్తామని రేవంత్ రెడ్డి చెపుతుండు. కేసీఆర్ చెప్పింది చేసిండు. ఆసరా పెన్షన్ లు 2 వేలు చేస్తా అనిచెప్పిండు చేసిండు. మళ్ళీ గెలిస్తే 5 వేలు చేస్తాడన్నారు. కేసీఆర్ కు 9 మంది అక్కా చెల్లెల్లు.. ఆడబిడ్డ లంటే ఎంతో ప్రేమ ఉంటుందన్నారు.

పదేళ్లక్రితం రాష్ట్రంలో తాగడానికి మంచినీళ్లు కూడా లేవు. కూడల్లివాగులో నిండు ఇందాకాలం మత్తడి దుంకుతుంది. కరువు శాశ్వతంగా దూరం పోయింది.. గుంట పంట ఎండకుండా కేసీఆర్ నీళ్లు ఇచ్చిండు. కష్ట పడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయవద్దు. గతి లేని సంసారం చేయవచ్చు కానీ సుతి లేని సంసారం చేయలేము… కాసంగ్రెస్ పార్టీ లో సుతి లేదని విమర్శించారు. డజను మంది ముఖ్యమంత్రులు ఉన్నారు..కుర్చీ కోసం కొట్లాడుతున్నారని పేర్కొన్నారు.

బీజేపీ గెలుస్తే రైతు బంధు రాదు.. సౌభాగ్య లక్ష్మి రాదు.. రేషన్ షాపుల్లో సన్నబియ్యం రావు.  బియ్యం కొనమని  నూకలు తినమన్నాడు.. నూకలు తినమన్న పార్టీకి నూకలు చెల్లెలా చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ మహిళా సంఘాలు కట్టిస్తాం. రైతుబీమా మా మాదిరిగా కేసీఆర్ బీమా పథకం తెస్తున్నాం.. తెల్ల రేషన్ కార్డు ఉన్న అన్ని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు.

Latest News

More Articles