Sunday, May 19, 2024

కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ కవిత

spot_img

నిజామాబాద్: బోధన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు ఎమ్మల్సీ కవిత. ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read.. కాంగ్రెస్‎కు పవర్ ఇస్తే.. మీ ఇంట్లో పవర్ కట్

60 లక్షల గులాబీ సైన్యం ముందు మీరెంత అంటూ హెచ్చరించారు. సత్తా కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులను ప్రజాక్షేత్రంలో దీటుగా ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు తెగబడితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

Latest News

More Articles