Saturday, May 18, 2024

స‌బితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గ‌ర్వం లేదు

spot_img

మంత్రి స‌బితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గ‌ర్వం లేదు అని తెలిపారు సీఎం కేసీఆర్. ఆమె త‌న నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేశార‌ని, ఇలాంటి ఎమ్మెల్యేను ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదని ప్రశంసించారు. ఇవాళ(గురువారం) మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.

ఉద‌యం వ‌ర్షం ప‌డ్డా, ఇప్పుడు ప‌డుతూనే ఉన్న మీరు ఇంత మంది వచ్చారంటే స‌బిత‌ గెలుపు ఖాయ‌మైపోయింది. రోజు మీతో క‌లిసి ఉండే వ్య‌క్తి. స‌బిత‌కు ఎంత ఓపిక ఉంట‌దో మీకు తెలుసు. భూదేవీకి ఎంత ఓపిక‌ ఉంట‌దో స‌బిత‌కు అంత ఓపిక‌ ఉంటుంది. పొద్దున్నే తెల్లారి నుంచి మొద‌లుకుంటే రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు స‌బిత ఇంటికి పోతుంటారు. క‌లుస్తారు.. మాట్లాడుతారు. వారి ప‌రిధిలో ఉన్న ప‌ని వారే మంత్రిగా చేయిస్త‌రు. వారి ప‌రిధి దాటి ఉంటే ప‌ట్టుబ‌ట్టి ఆ ప‌ని త‌న ద‌గ్గ‌ర‌కు తీసుకొచ్చి చేయించే దాకా వ‌దిలిపెట్ట‌రు అని కేసీఆర్ తెలిపారు.

మొద‌టిది ముంపు స‌మ‌స్య‌.. అది ప‌రిష్కారం అయింది. ఇక రెండోది తాగునీటి స‌మ‌స్య‌. పేరుకు హైద‌రాబాద్ కానీ చాలా స‌మ‌స్య ఉండే. కుత్బుల్లాపూర్, శేరిలింగంప‌ల్లి, రాజేంద్ర‌న‌గ‌ర్, మ‌హేశ్వ‌రం ప్రాంతాల్లో మొత్తం చాలా ప్రాబ్లం ఉండే. పైపు లైన్ వేయ‌మ‌ని, దాన్ని నివారించాల‌ని చెప్పి రూ. 670 కోట్ల‌తో శివారు న‌గ‌రాల‌కు మంచినీళ్లు తీసుకొచ్చి బాధ‌లు తీర్చాం. ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్ర‌త్యేక పైపు లైన్ వ‌స్తుంది. అది పూర్త‌యితే శాశ్వ‌తంగా మంచి నీటి బాధ‌లు తీరుతాయి అని కేసీఆర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొద్దు

కందుకూరుకు మెడిక‌ల్ కాలేజీ వ‌చ్చిదంటే స‌బిత ఇంద్రారెడ్డినే కార‌ణం. ప‌ట్టుబ‌ట్టి మెడిక‌ల్ కాలేజీ తెప్పించుకున్నారు స‌బిత‌. మెడిక‌ల్ కాలేజీకి అనుంబ‌ధంగా 500 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి రాబోతోంది. స్థానికంగా ఉన్న వారికి ఇది ఎంతో ఉప‌యోగం. పారామెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీలు వ‌స్తాయి. కందుకూరు మంచి హ‌బ్‌గా మార‌బోతోంది. మెట్రో రైలు కందుకూరు దాకా రావాల‌ని కేబినెట్ మీటింగ్‌లో పోరాటం చేశారు. తుక్కుగూడ ప్రాంతంలో 52 కొత్త ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. జిల్లా క‌లెక్ట‌రేట్ స‌మీపంలోనే ఉంది. ఫ్యాక్స్ కాన్ ఇండ‌స్ట్రీ వ‌చ్చింది. ల‌క్ష మంది పిల్ల‌ల‌కు ఉద్యోగాలు వ‌స్తాయి. చైనాలో ఉన్న‌ పెద్ద కంపెనీ మూసుకుని ఇక్క‌డేకు వ‌స్తాం.. కొంత జాగా ఇవ్వండ‌ని అంటున్నారు. అది ఆల్‌మోస్ట్ ఫైన‌ల్ అయిపోతోంది ద‌గ్గ‌ర‌ప‌డ్డ‌ది. దీంతో 2, 3 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు వ‌స్తాయన్నారు.

మీ మౌలిక వ‌స‌తులు, తాగునీటి, రోడ్ల అభివృద్ధి గురించి ఆమె ప‌డే త‌ప‌న మామూలుగా ఉండ‌దు. ఆమె మంత్రి అనుకోదు. మ‌హేశ్వ‌రం నుంచి సామాన్య కార్య‌క‌ర్త అనుకుంట‌ది. ఎడ్యుకేష‌న్ మంత్రిగా ఉండి కూడా తానే గ‌ర్వానికి పోయి మంజూరు చేసుకోలేదు. ప‌ద్ద‌తి పాటించి న‌న్ను కోరితే లా, డిగ్రీ, జూనియ‌ర్ కాలేజీలు ఏర్పాటు చేశాం. ఇంత ప‌ట్టింపుతో ప‌ని చేసిన ఎమ్మెల్యే ఇంత వ‌ర‌కు ఎవ‌రూ రాలేదు. ఇంత మంచి ప‌నులు చేశారు. ఇవాళ ఎవ‌డో వ‌చ్చి ఏదో చెప్త‌డు. ర‌క‌ర‌కాల మాట‌లు చెప్తారు. అలాంటి వారి మాట‌లు న‌మ్మొద్ద‌ని కోరారు సీఎం కేసీఆర్.

ఇది కూడా చదవండి: రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొద్దు

Latest News

More Articles