Sunday, May 19, 2024

ఉద్యమంలో మాటిచ్చా.. నేడు నెరవేర్చా

spot_img

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, రంగారెడ్డి చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ రోజు ఇవాళ అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఒక‌ప్పుడు పాల‌మూరు బిడ్డ హైద‌రాబాద్‌లో అడ్డా కూలీ. కానీ ఇవాళ పాల‌మూరుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలు వ‌స్తున్నారు. స్థానికులు ఇక్క‌డే త‌మ పొలాలు ప‌ని చేసుకుంటున్నారు. పాల‌మూరు బిడ్డ‌ల మారిన ముఖ‌చిత్రం ఇది అని కేసీఆర్ తెలిపారు. పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల పథ‌కం ప్రారంభించిన అనంత‌రం కొల్లాపూర్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు.

తెలంగాణ ఉద్య‌మంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు.. మీకు మాటిచ్చాను. రాష్ట్రం వ‌స్తేనే స‌క‌ల ద‌రిద్ర‌లు మాయ‌వ‌వుతాయి అని తెలిపాను. మ‌న హ‌క్కులు, నీళ్లు వ‌స్తాయ‌ని చెప్పాను. క‌ష్ట‌ప‌డి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. పాల‌మూరు ఎంపీగానే తెలంగాణ సాధించాను. ఇది ఒక చ‌రిత్ర‌. ఈ జిల్లా కిర్తికీరిటంలో శాశ్వ‌తంగా ఉంటుంది. మొత్తం తెలంగాణ‌లో అంచ‌నాలు వేసుకుని, మ‌న‌కు రావాల్సిన వాటాలు లెక్క‌లు క‌ట్టుకుని మూడు పెద్ద ప్రాజెక్టులు చేప‌ట్టాం.

కాళేశ్వ‌రం, సీతారామ‌, పాల‌మూరు ఎత్తిపోత‌ల‌.. ఈమూడు పూర్త‌యితే తెలంగాణ‌ వ‌జ్రం తున‌క‌లా త‌యారై దేశానికే అన్నం పెడుతాం. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా కాళేశ్వ‌రం పూర్తి చేసుకున్నాం. సీతారామ ప‌నులు చ‌క‌చ‌క జ‌రుగుతున్నాయి. పాల‌మూరు ఎత్తిపోత‌ల కూడా మూడు నాలుగేండ్ల కింద‌నే పూర్త‌యితుండే. కానీ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ఉండే గ‌త్త‌ర బిత్త‌ర నాయ‌కులు అడ్డుకున్నారు. ఇక్క‌డ ఉండే ద‌ద్మ‌మ్మ రాజ‌కీయ నాయ‌కులు శ‌త్రువులుగా మారి ప్రాజెక్టు ప‌నుల‌ను అడ్డుకున్నారు.

Latest News

More Articles