ఆసియా కప్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. సూపర్ 4 లో సత్తా చాటిన భారత్, శ్రీలంక జట్లు ఇప్పుడు ఫైనల్ కు చేరుకున్నాయి. రేపు(ఆదివారం) భారత్, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలో దిగిన శ్రీలంక, మరోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తుండగా.. భారత్ కూడా టైటిల్ గెలిచి సమం చేయాలని చూస్తోంది.
అయితే ఈ మ్యాచ్ జరిగే ఆదివారం రోజున వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నట్లు శ్రీలంక వాతావరణ సంస్థ ప్రకటించింది. ఆదివారం(సెప్టెంబర్ 17న) వర్షం పడితే కనీసం 20 ఓవర్లు అయినా ఆడిస్తారు. ఒకవేళ అదీ సాధ్యం రిజర్వ్ డే(సెప్టెంబర్ 18)న యథావిధిగా మ్యాచ్ జరుగుతుంది. దురదృష్టం కొద్దీ ఆరోజు కూడా వరుణుడు అడ్డుపడితే రెండు జట్లను విజేతగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే అవకాశం ఉంది.
ఆసియా కప్ ఫైనల్ జట్లు…
భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమర విక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.