ఇవాళ(సోమవారం) సీఎం కేసీఆర్ జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గద్వాల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతోపాటు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత గద్వాలలోని అయిజ రోడ్డులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గద్వాల పట్టణం గులాబీమయంగా మారింది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ బీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయాయి. సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.