తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి దగ్గర ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.