Sunday, May 19, 2024

న‌వ‌శ‌కం.. సీఎం కేసీఆర్ సరికొత్త రికార్డు

spot_img

దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం సరికొత్త రికార్డు న‌మోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల త‌ర‌గ‌తుల‌ను సీఎం కేసీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు,వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Latest News

More Articles