సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థిని రాధిక ( 8 నెలల గర్భిణి) మృతి చెందింది.
Also Read.. భారత్కు పెను ముప్పు.. సూపర్ బగ్స్తో వేలల్లో మరణాలు!!
పరీక్షకు వెళ్లే తొందరలో వేగంగా పరీక్షా గదికి చేరుకున్న రాధికకు బీపీ ఎక్కువై, చెమటలొచ్చి పరీక్షా గదిలోనే పడిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది రాధికను పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు.