ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని రేపు (గురువారం) మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో వసంత్ విహార్లోని బీఆర్ఎస్ ఆఫీసుకు సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. హోమం, యాగం, వాస్తు పూజల్లో పాల్గొననున్నారు. ఈ తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం తర్వాత కార్యాలయంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు.
కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే పార్టీ కార్యాలయాన్ని తమ ఆధీనంలో తీసుకున్న భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇప్పటికే మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఢిల్లీకి చేరుకున్నారు.