వనపర్తి: సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 26న వనపర్తిలో సీఎం కేసీఆర్ సభ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Also Read.. ఎలక్షన్ గాంధీ.. ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డుల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని క్యాడర్ కు సూచించారు. ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించడంతో పాటు సీఎం కేసీఆర్ సభకు రావాలని ఆహ్వానించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు, పార్టీ నేతలకు దుర్గాష్టమి, దసరా శుభాకాంక్షలు తెలిపారు.