Friday, May 3, 2024

మంజీరా న‌దిలోకి దూసుకెళ్లిన ట్రాక్ట‌ర్..ముగ్గురు మృతి

spot_img

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. స‌దాశివ‌పేట మండ‌లం కొల్కూర్ గ్రామ స‌మీపంలో ఓ ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి మంజీరా న‌దిలోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు మృతి చెందారు. ట్రాక్ట‌ర్ న‌దిలోకి దూసుకెళ్ల‌డాన్ని గమనించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు మంజీరా న‌ది దగ్గరకు చేరుకుని స్థానికుల స‌హాయంతో మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు వెలికితీశారు. మృతుల‌ను గోపాల్(30), ర‌మ‌ణ‌(45), మ‌ల్లేశ్‌(30)గా పోలీసులు గుర్తించారు. ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం కారణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు

 

 

Latest News

More Articles