బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్లో జారిపడటంతో తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను సీఎం రేవంత్రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. వారి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అవసరమని అన్నారు. కేసీఆర్ కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.
ఇది కూడా చదవండి:బాసర విద్యార్థులకు రూ. 17 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం